BUDGET 2021 HIGHLIGHTS
- మూలధన వ్యయం 5.34 లక్షల కోట్లు.
- రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కోసం రూ. 5 వేల కోట్లు.
- స్కిల్ డెవలప్ మెంట్ కు రూ. 3 వేల కోట్లు.
- ఆరోగ్య రంగానికి 137 శాతం నిధుల పెంపు.
- ఎలక్ట్రానిక్ పేమెంట్లను పెంచేందుకు రూ. 1,500 కోట్లు.
- నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద 1,500 స్కూళ్ల అభివృద్ధి.
- కొత్తగా మరో 750 ఏకలవ్య పాఠశాలలు.
- అదనంగా 100 సైనిక స్కూళ్ల ఏర్పాటు.
- వ్యవసాయ మౌలిక నిధి ఏర్పాటు.
- ఈ నిధితో మౌలిక సౌకర్యాల పెంపు.
- ఒకే వ్యక్తి సార్థ్యంలోని కంపెనీలకు అనుమతులు.
- ఒకే దేశం ఒకే రేషన్కార్డు విధానం దేశంలో అన్ని ప్రాంతాల్లో అమలు.
- వలస కార్మికులకు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం.
- కుటుంబ సభ్యులు వేర్వేరు చోట్ల ఉంటే వాటా ప్రకారం రేషన్.
- రూ. 50 లక్షల నుంచి రూ. 2 కోట్ల పెట్టుబడి పరిమితి వరకూ చిన్న సంస్థలే.
- కొత్త ప్రాజెక్టుల కోసం ప్రస్తుత ప్రాజెక్టుల్లో పెట్టుబడుల ఉపసంహరణ తప్పనిసరి.
- రూ. 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం చేరాలంటే రెండంకెల వృద్ధి తప్పనిసరి.
- 15వ ఆర్థిక సంఘం సూచనల ప్రకారం కేంద్ర పథకాల హేతుబద్ధీకరణ.
- 2021-22లో బీపీసీఎల్, ఎయిర్ ఇండియా, ఐడీబీఐల అమ్మకం పూర్తి.
- ఈ సంవత్సరమే ఎల్ఐసీ ఐపీవో.
- మూలధన సహాయం కింద ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.20వేల కోట్లు.
- మంచి ఆర్థిక వ్యవస్థ కోసం బ్యాడ్ బ్యాంక్.
- గెయిల్, ఐఓసీ, హెచ్పీసీఎల్ పైపులైన్లలో పెట్టుబడుల ఉపసంహరణ.
- స్టార్టప్లకు చేయూత కోసం ఏకసభ్య కంపెనీలకు మరింత ఊతం.
- ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ భారత్ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1,75,000 కోట్ల టార్గెట్.
- రెగ్యులేటర్ గోల్డ్ ఎక్సే్ఛంజీల ఏర్పాటు.
- ఇన్వెస్టర్ చార్టర్ ద్వారా ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ.
- బీమారంగంలో ఎఫ్డీఐలు 49 శాతం నుంచి 74 శాతానికి పెంపు.
- ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థలో సంస్కరణలు.
- 1938 బీమా చట్టం సవరణ. డిపాజిట్లపై బీమా పెంపు.
- రూ. 3,05,984 కోట్లతో డిస్కమ్లకు సాయం.
- రూ. 18 వేల కోట్లతో బస్ట్రాన్స్ పోర్ట్ పథకం.
- వాహనరంగం వృద్ధి చర్యలు.
- కొచ్చి మెట్రో రెండో దశకు కేంద్రం సాయం.
- చెన్నై మెట్రోకు రూ. 63,246 కోట్లు.
- బెంగళూరు మెట్రోకు రూ.14,788కోట్లు.
- 2022 జూన్ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు.
- ఖరగ్పూర్-విజయవాడ మధ్య ఈస్ట కోస్ట సరకు రవాణా కారిడార్.
- రైల్వే మౌలిక సౌకర్యాలకు రూ.1,01,055 కోట్లు.
- 2023 కల్లా విద్యుదీకరణ పూర్తి.
- దేశంలోనే తొలిసారిగా డిజిటల్ పద్ధతిలో జనాభా లెక్కలు.
- జనగణనకు రూ. 3,678 కోట్ల కేటాయింపు.
- ఆర్థిక రంగ పునరుత్తేజానికి రూ. 80 వేల కోట్లు.
- 2021-2022 ద్రవ్యలోటు 6.8 శాతం.
- 2025 నాటికి 4.8 శాతం టార్గెట్.
- గోవా డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం రూ. 300 కోట్లు.
0 Comments